Thursday, April 25, 2024
- Advertisement -

రోజాతో అవసరమా అని అలోచించా : నాగబాబు

- Advertisement -

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జబర్దస్త్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ నుంచి ఇటీవలే నాగబాబు తప్పుకోవడంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది. దీనీపై నాగబాబు స్పందించినప్పటికి ఆ వార్తలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన మరో వీడియో ద్వారా వచ్చి జబర్దస్త్ సీక్రెట్స్ ను బయటపెట్టారు. వివారాల్లోకి వెళ్తే..

జబర్దస్త్ షోను ముందుగా 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేశారని.. అందుకు మాత్రమే జడ్జిగా ఉండమని అడిగారు. నాతో పాటు రోజా కూడా జడ్జిగా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే 25 ఎపిసోడ్స్ ఏంటి.. షో నచ్చితే ఎన్ని ఎపిసోడ్స్ అయిన చేసేందుకు రెడీ అని అనుకున్నాను. కానీ సరిగ్గా ఆ టైంలోనే తాను ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లడం.. మరోవైపు రోజా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరడం జరిగిందని నాగబాబు చెప్పారు.

నేను, రోజా ఇద్దరం ప్రత్యర్ధి పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ షోలో చేయాలా ? వద్దా ? అని మొదట అలోచించాను. అయితే పొలిటికల్ విభేదాలు వేరు.. క్రియేటివ్ ఫీల్డ్ వేరు కాబట్టి.. తాను జడ్జిగా చేసేందుకు ఒప్పుకున్నట్లు నాగబాబు అన్నారు. ఇక అనసూయ యాంకరింగ్ బాగుంటుందని ఆయన అన్నారు. అలా 25 ఎపిసోడ్స్ వస్తే.. తొలి ఎపిసోడ్‌కే బ్లాక్ బస్టర్ కావడంతో షోకి టీఆర్పీ రేటింగ్ కూడా బాగా పెరిగిపోయింది.

దాంతో ఏడేళ్ల పాటు ఈ షో కంటిన్యూ అయింది. అదుర్స్ షో కోసం లక్షలు ఖర్చు పెట్టిన రాని టీఆర్పీ రేటింగ్ జబర్దస్త్ కు వచ్చిందని నాగబాబు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -