- Advertisement -
సాధారణంగా ఒక సినిమాకు ఒకరు లేదా ఇద్దరు నిర్మాతలు ఉంటారు.కాని ఒక సాధారణమైన సినిమాకు 115 మంది నిర్మాతలుగా వ్యవహరించారు. హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు ‘గౌతమ్’ హీరోగా చేస్తున్న ‘మను’ సినిమాకు 115 మంది నిర్మాతలు మారారటా! ఫణీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందిని హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతు..”ఈ కథను నమ్మిన వాళ్లంతా తమకి తోచిన స్థాయిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ల నమ్మకానికి ఎంత మాత్రం తగ్గకుండగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను” అన్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్.ట్రైలర్ కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.