యాంకర్ ప్రదీప్ హీరోగా మారుతూ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. మున్నా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
‘గీత ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ముందుకు రావడంతో.. అందరి ఫోకస్ ఈ చిత్రం పై పడింది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగతం అందించాడు. ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం అనే పాట యూట్యూబ్లో 191 మిలియన్ల పైనే వ్యూస్ ను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించడంతో ఈ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రం పై క్రేజ్ మరింతగా పెరిగింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ రిజెక్ట్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
దర్శకుడు మున్నా ఈ సినిమా కథను ముందు సత్యకు చెప్పాడట. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సట. సత్యదేవ్ కు కూడా కథ నచ్చి.. ‘కచ్చితంగా చేస్తాను’ అని చెప్పాడట. కానీ ఆ టైములో సత్య వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో.. దర్శకుడు మున్నా.. ప్రదీప్ తో ట్రయిల్ షూట్ చేసాడట. దాంతో సత్యదేవ్ ను కలిసి.. ‘నీకు కుదరడం లేదు కదా ప్రదీప్ బాగా చేస్తున్నాడు. తనతో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నట్టు’ చెప్పాడట. ఫైనల్ గా సినిమా కంప్లీట్ అయ్యాక.. అవుట్ పుట్ బాగా వచ్చిందని కూడా సత్యదేవ్ తో చెప్పాడట.
ఈ సెలబ్రిటీలకే కవల పిల్లలు ఉన్నారు.. ఎవరో చూడండి..!
ధృవ వర్జినల్ దర్శకుడితో రామ్ చరణ్ తేజ సినిమా..?