Friday, March 29, 2024
- Advertisement -

ఒకే ఫ్రేమ్‌లో జెమినీ గనేశ‌న్ కూతుర్లు

- Advertisement -

‘మహానటి’ సినిమా తరువాత సావిత్రి గురించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. గూగుల్‌లో కూడా ఆమె గురించి ఎక్కువుగా సెర్చ్ చేస్తున్నారు.ఇక వెబ్‌సైట్స్‌లో అయితే సావిత్రి గురించి అనేక వార్తలు వెలువ‌డుతున్నాయి.సావిత్రి జెమిని గ‌ణేశ‌న్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.అంత‌క‌ముందే జెమిని రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. సావిత్రికి త‌ప్ప మిగిలిన ఇద్ద‌రి భార్యల‌కు అంద‌రు కుమార్తెలే పుట్టారు.
సావిత్రికి ఒక అబ్బాయి,ఒక అమ్మాయి పుట్టారు.

మొద‌టి భార్య అల‌మేలుకు న‌లుగురు కుతుర్లు,ఇక రెండ‌వ భార్య పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు.అందులో ఒక‌రే బాలీవుడ్ హీర‌యిన్ రేఖ‌.మొత్తం ఏడుగురు అక్కచెల్లెల్లు ఒక ఈవెంట్ లో పాల్గొని కలిసి ఫోటో తీసుకున్నారు. వారి మధ్య ఉన్న అనుబంధానికి ఈ ఫోటో అద్దం పడుతోంది. కమల సెల్వరాజ్, రేఖా, నారాయణి, రేవతి, రాధ, విజయ ఛాముండేశ్వరి, జయ శ్రీధర్ అందరూ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో జెమిని కుటుంబంలో విభేదాలు వ‌స్తున్న త‌రుణంలో వీరంద‌రు క‌లిసి ఇలా ఫోటో దిగ‌డం చ‌ర్చ‌నీయంశంగా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -