- Advertisement -
టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాతపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే….. రాజా మీరు కేక మూవీ నిర్మాత రమేష్ రెడ్డిపై ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాతల మధ్య మనస్పర్థలు తలెత్తటంతో ఇచ్చిన రూ.2లక్షల్ని తనకు తిరిగి ఇచ్చేయాలంటూ కెమేరామెన్ను కోరారు.
కెమేరామెన్ సతీమణిపై నిర్మాత అసభ్యంగా వ్యవహరించినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిర్మాత రమేశ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.