Saturday, April 20, 2024
- Advertisement -

ట్రైలర్ రివ్యూ : మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘జోడి’

- Advertisement -

ఈ మధ్యనే నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా హీరో ఆది సాయి కుమార్ తో ‘జోడి’ అనే సినిమాలో రొమాన్స్ చేస్తోంది. కొత్త దర్శకుడు కె.విశ్వనాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఒక ఫుల్ లెంత్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

వి కె నరేష్, సత్య, వెన్నెల కిషోర్, స్వప్నిక, సితార, మాధవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భావన క్రియేషన్స్ పతాకంపై సాయి వెంకటేష్ గుర్రం మరియు పద్మజ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బుర్రకథ’ సినిమాతో కూడా డిజాస్టర్ అందుకున్న ఆది ఈ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -