Thursday, April 18, 2024
- Advertisement -

ఒక్క సాంగ్‌తో నాని ని మాస్ హీరోగా మార్చిన రచయిత & సింగ‌ర్ పెంచల దాస్

- Advertisement -

అది ఏంటీ ఒక్క‌సాంగ్‌తో నాని మాస్ హీరోగా మార‌డం ఏంటీ అనుకుంటున్నరా! ఏంలేదండీ …నాని తాజా చిత్రం కృష్ణార్జున యుద్దం సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు రెడీగా ఉంది. ఇటీవ‌లే ఈ సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్ తిరుప‌తిలో జ‌రిగింది.ఈ ఫంక్ష‌న్‌కు హీరో, హీరోయిన్ల‌తోపాటు చిత్ర యూనిట్ పొల్గొంది.ఈ సినిమాలోని సాంగ్స్ ఒక్కొటి యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు.సినిమాలోని అన్ని సాంగ్స్ కన్నా ఓ సాంగ్ మాత్రం సినిమా విడుద‌ల‌కు ముందే పెద్ద హిట్ అయ్యింది.ఆ సాంగే దారి చూడు..దుమ్ము చూడు ..దున్న‌పోతుల బైరే చూడు సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో హల్ చ‌ల్ చేస్తుంది. 10.5మిలియ‌న్ల మంది ఈ సాంగ్‌ని యూట్యూబ్‌లో చూశారంటే ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీరే అర్థం చేసుకోవాలి.

ఈ పాట‌ను రాసి,పాడింది రాయ‌ల‌సీమ కుర్రాడు పుట్ట పెంచ‌ల‌దాస్‌. వీరు పుర్వీకులు పెద్ద జాన‌ప‌ద క‌ళాకారులు. పెంచ‌ల‌దాస్ స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా,చిట్వేలి మండ‌లం, దేవ‌మాచుప‌ల్లి గ్రామం. సినిమాలోని ఈ సాంగ్‌పై స్ప‌దించ‌మంటే పెంచలదాస్ మేము దాస‌రి వాళ్లం మాకు పుట్ట‌క‌తోనే పాట‌ల‌పై అవ‌గాహ‌న ఉంటుంది. ఎవ‌రైనా చ‌నిపొయిన‌ప్పుడు ,క‌ర్మాకండ‌లు అప్పుడు జ‌రిగే వాటికి మమ్మ‌ల్ని పిలిచి పాట‌లు పడించుకుంటారు, అది మా కుల వృత్తి అదే ఇప్పుడు నన్ను సినిమాల‌లోకి తీసుకువ‌చ్చంద‌ని పెంచలదాస్ వివ‌రించారు. ఈ ఒక్క సాంగ్‌తో హీరో నాని ని మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేశాడు పెంచలదాస్. ఆయ‌న ఇలాంటి సాంగ్స్ మ‌రన్నీ రాయ‌ల‌ని మ‌నం కొరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -