Friday, March 29, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన సినీ న‌టుడు మోహ‌న్ బాబు

- Advertisement -

ఎన్నిక‌ల వేడి ఏపీలో తార స్థాయికి చేరుకుంది. టికెట్లు ప్ర‌క‌టించిన త‌రువాత కూడా ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరిక‌లు జ‌రుగుత‌నే ఉన్నాయి. నిన్న‌టి నిన్న టీడీపీ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఇక రెండు రోజులు క్రితం సినీ న‌టుడు మోహ‌న్ బాబు చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న వైసీపీ పార్టీలో చేరారు. హైద‌రాబాద్‌లోని జ‌గ‌న్ నివాసనికి వెళ్లి మరి జ‌గ‌న్‌ను క‌లిశారు మ‌హ‌న్ బాబు. మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, ప్రజలకు జగన్ మంచి చేస్తారనే నమ్మకంతోనే వైసీపీలో చేరానని చెప్పారు.

ఎప్పుడో వైసీపీ పార్టీలో చేరాల‌ని భావించాన‌ని కాని ,న‌న్ను మూడేళ్ల క్రితమే తనను జగన్ ఆహ్వానించారని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ అధినేత‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. గతంలో ఆయ‌న టీడీపీ పార్టీకి సానుభుతి పరుడిగా ఉండేవారు. చంద్ర‌బాబుతో విభేదాలు రావ‌డంతోనే ఆయ‌న వైసీపీ పార్టీలో చేరారు. పైగా వైఎస్ ఫ్యామిలీతోమంచు ఫ్యామిలీకి బందురికం కూడా ఉండటంతో ఆయ‌న వైసీపీలో చేరిన‌ట్లు తెలుస్తోంది.మోహ‌న్ బాబుతో పాటు ఆయ‌న పెద్ద కొడుకు హీరో మంచు విష్ణు కూడా జ‌గ‌న్ నివాసనికి వెళ్లారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -