టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి.. విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది కథనాయిక ఆమని. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. హీరోయిన్ సౌందర్య గురించి మాట్లాడూతూ.. “నేను, సౌందర్య ఇద్దరం బెంగుళూరులోనే ఉండేవాళ్లం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాము. మా అలావాట్లు, అభిప్రాయాలు.. ఆలోచనలు కలవడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అందువలన మేము ఏదైన ఒకర్ని ఒకరు గౌరవించుకుంటూ ఉండేవాళ్లం” అని చెప్పింది.
ఒకసారి ఒక మూవీ షూటింగ్ టైంలో.. నేను, సౌందర్య ఇద్దరం ఉన్నాము. అక్కడ సౌందర్యతో పాటు వాళ్ల నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి.. సౌందర్య సోదరుడు ’అమర్’ను పెళ్లి చేసుకోమని అడిగారు. ఆయన అలా అడిగేసరికి నాకు ఏం చెప్పాలో అర్దం కాలేదు. నిజం చెప్పాలంటే షాక్ అయ్యాను. ఆ తర్వాత అమర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన కూడా నాతో స్నేహంగా ఉండేవాడు. సౌందర్య, అమర్ వంటి మంచి ఫ్రెండ్స్ ను కోల్పోవడం నిజంగా దురదృష్టం. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో సౌందర్య గుర్తొస్తూనే ఉంటుంది’ అని ఆమని చెప్పుకొచ్చింది.