Wednesday, April 24, 2024
- Advertisement -

నిఖిల్ హీరోయిన్ అక్ష గుర్తుందా ?

- Advertisement -

తెలుగులో పరశురామ్ దర్శకత్వం టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరో వచ్చిన యువత సినిమాలో హీరోయిన్ గా నటిచింది ముంబై హీరోయిన్ అక్ష. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకోవడంతో ఈ భామకు మంచి క్రేజ్ వచ్చింది. కథల విషయంలో సరైన అవగాహన లేక కొన్ని సినిమాలు చేడంతో అవి ప్లాప్ అయ్యాయి.

దాంతో ఈమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే అక్ష ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే మోడలింగ్ లోకి వచ్చింది. అలా మోడలింగ్ లో శిక్షణ తీసుకుని మంచి మోడల్ గా ఎదిగింది. మోడలింగ్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. మొదటిగా అక్ష 2004లో ముసాఫర్ అనే బాలీవుడ్ చిత్రంలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది. అయితే తెలుగులో ఈ అమ్మడు నటించినటువంటి యువత, రైడ్, రయ్ రయ్ తదితర చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆఫర్స్ ఎక్కువగా రాకపోవడంతో పలు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించింది.

కాగా అక్ష తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కూడా నటించింది. అయితే చివరి సారిగా అక్ష టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించినటువంటి రాధా అనే చిత్రంలో రుక్మిణి అనే యువతి పాత్రలో కనిపించింది. తర్వాత మళ్లీ కనిపించలేదు. మళ్లీ ఆఫర్స్ కోసం ఈ భామ ఎదురు చూస్తోందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -