సీరియల్స్ లో నటించే దీపికా సింగ్ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు తన తల్లికి కరోనా పాజిటివ్ సోకిందని ఈ బుల్లితెర నటి వాపోయింది. దియా ఔర్ బాటి హమ్ సీరియల్లో నటిస్తున్న దీపికా సింగ్.. ఢిల్లీలో ఉంటున్న తన తల్లిదండ్రులకు కోవిడ్ చికిత్స అందించాలని సీఎం కేజ్రీవాల్ ను కోరింది. ఇన్స్టాగ్రామ్ లో దీపికా ఓ వీడియో పోస్ట్ చేసింది.
తమది ఉమ్మడి ఫ్యామిలీ అని.. తమ ఇంట్లో మొత్తం 45 మంది ఉంటారని.. అందులో 59 ఏళ్ల తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీలో పరీక్షలు జరిపారని, కానీ రిపోర్ట్స్ ఇవ్వలేదని, తల్లికి కరోనా చికిత్స అందించాలంటూ సీఎం కేజ్రీవాల్ ను ఆమె కోరింది. తన తల్లి బయటకు వెళ్లలేదని.. కానీ ఆమెకు వైరస్ ఎలా సోకిందో అర్దం కావడం లేదని చెప్పింది. ఇంట్లో ఉన్న వారికి కూడా టెస్టులు చేసి రక్షించాలని వేడుకుంది.
ఢిల్లీలోని కరోనా పేషంట్లను ట్రీట్ చేసే ఆస్పత్రులకు ఫోన్ చేసినా బెడ్స్ ఖాళీ లేవంటున్నారని నటి ఆవేదన వ్యక్తం చేసింది. తమకు సాయం చేయమంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తన తల్లి చాలా నీరసంగా ఉందని దయచేసి సాయం చేయమని కోరింది. ఇక ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ.. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్దం కావడం లేదని భయపడుతున్నారు.
ఆ కమెడియన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చా.. : ప్రగతి
బెడ్ సీన్స్ చేయమని అడిగారు : నిహారిక