దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి వంటి సినిమా తరువాత తెరకెక్కిస్తున్న చిత్రంRRR(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లు హీరోలుగా నటిస్తున్నారు.ఈ సినిమా గురించి రోజుకో విషయం బయటకు లీక్ అవుతుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటికి ,హీరోయిన్ల ఎంపిక మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. తాజాగా సినిమాలో ఓ హీరోయిన్ని తీసుకున్నారని తెలుస్తుంది. మహనటితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ను ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో కీర్తి సురేష్ సీత అనే పాత్రలో నటించనుందట. ఈ పాత్ర సినిమాలో కీలకంగా ఉండనుందని తెలుస్తుంది.కీర్తి సురేష్ పాత్ర సెంటిమెంట్తో కూడుకున్నదిగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అయితే కీర్తి సురేష్ ఏ హీరో పక్కన చేస్తుందో తెలియాల్సి ఉంది.మరో హీరోయిన్గా పూజా హెగ్డె పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం.ప్రస్తుతానికి అయితే కీర్తి సురేష్ పేరు ఫైనల్ అయినట్లు సమాచారం.