Thursday, March 28, 2024
- Advertisement -

పెళ్లి గురించి చెప్పిన హీరోయిన్ మాధవీలత..!

- Advertisement -

సినిమాలతో కంటే బయట ఎక్కువ వివాదాలతోనే బాగా ఫేమస్ అయింది మాధవీలత. క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేయడం.. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం.. పవన్ కు మద్దతుగా నిలవడం.. ఇలా నిత్యం ఏదో ఒక పోస్ట్ తో వార్తల్లో నిలుస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది మాధవీలత. రాజకీయాల్లో ఉంటూ రాజకీయంగా కూడా విమర్శలు చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీలత ఆ మధ్య చిత్రపురి కాలనీ సమస్యలపై, రాకేష్ మాస్టర్ వ్యవహారంపై, కరోనా వైరస్ వ్యాప్తి చెందడంపై, లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంపైనా కామెంట్స్ చేసింది.

ఇక శ్రీరెడ్డిపై చేసే పరోక్ష కామెంట్స్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ లాక్ డౌన్ టైంలో దిల్ రాజు, నిఖిల్ సిద్దార్థ్‌ల పెళ్లిళ్లు జరిగాయి. వీటిపైనా మాధవీలత సెటైర్స్ వేసింది. మాస్క్ ధరించే పెళ్లిలు చేసుకోవడం అవసరమా ? ఆగలేకపోతున్నారా ? అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. రీసెంట్‌గా సమంత చేసిన ఓ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసుకుని మాధవీలత తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ పోస్ట్ నాకెంతో నచ్చింది. అవును నిజమే.. కించపరిస్తే, తక్కువగా చూస్తే నాలోని బెస్ట్ బయటకు వస్తుంది.. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.. వాస్తవానికి అదే నేను.. ‘ అని మాధవీలత కామెంట్ చేసింది.

ఇక తాజాగా మాధవీలత చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఎన్నో నెలల తరువాత ఎంతో హ్యాపీగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభం అయింది.. అద్భుతాలు జరిగాయి.. అందుకే నేను అద్భుతాలను నమ్ముతుంటాను.. చాలా చాలా సంతోషంగా ఉన్నాను.. త్వరలోనే ప్రకటిస్తాను’అని తెలిపింది. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించగా.. లేదు ఇంకా యాక్టివ్‌గా అవుతున్నానని ఆమె జవాబు ఇచ్చింది. ఎక్కువ మంది మాత్రం పెళ్లి ఫిక్స్ అయిందని.. వరుడు ఎవరు ?.. పెళ్లి ఎప్పుడు అని మాధవీలతను అడుగుతున్నారు. మరి ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటో త్వరలోనే మాధవీలత చెబుతుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -