Thursday, March 28, 2024
- Advertisement -

నటి పావని గంగిరెడ్డి గురించి ఎవరికి తెలియని నిజాలు..!

- Advertisement -

పావని గంగిరెడ్డి.. శర్వానంద్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలుగా వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి. మనం ఇప్పుడు పావని గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. పావని 1987 ఆగస్టు 23న చెన్నైలో జన్మించింది. తన చదువంతా హైదరాబాద్లో పూర్తి చేసింది. బీటెక్ చదివిన పావని ఇన్ఫోసిస్లో టెక్నాలజీ హెడ్ కూడా వర్క్ చేసింది.

అయితే పావనికి బిటెక్ కంప్లీట్ అవ్వగానే పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు. ఒక పాప ఒక బాబు. ఒక వైపు జాబ్ చేస్తునే ఓ షార్ట్ ఫిలిం లో నటించింది. ఆ షార్ట్ ఫిల్మ్ లో పావని యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2015 లో వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం. ఆ సినిమా తర్వాత సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, జోఅచ్యుతానంద, అంతరిక్షం, నేను మీకు చెప్తా వంటి చిత్రాలలో నటించింది.

రీసెంట్ గా ఆమె ఎక్కడికి ఈ పరుగు అనే వెబ్ సిరీస్ తో కూడా యాక్ట్ చేసింది. తన యాక్టింగ్ కెరీర్ ను ఫ్యామిలీని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. పాప పుట్టాక మూవీలో ఆఫర్స్ వచ్చాక తనకెంతో ఇష్టమైన జాబ్ ను వదిలేసింది పావని. తనకు ఇప్పటికీ సినిమా కన్నా జాబ్ చేయడం ఇష్టమని రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -