Thursday, March 28, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ హీరోయిన్ కెరీర్ ముగిసినట్టేనా?

- Advertisement -

2015 లో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ అయింది మరియు తన నటన కి కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ సినిమా తరువాత ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ అవేమి మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. ఆఖరిగా మంచు విష్ణు హీరోగా ‘ఆచార అమెరికా యాత్ర’ సినిమాలో కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఆ సినిమాతో కూడా మరొక పెద్ద డిజాస్టర్ ను నమోదు చేసుకుంది.

దీంతో ఈమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో అయితే కనీసం చిన్నపాటి అవకాశాలు కూడా రావడం లేదని చెప్పచ్చు. ఒకవైపు ఈమె సోషల్ మీడియా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టీవ్ గానే ఉంది కాని ఇండస్ట్రీ లో మాత్రం ఈమె హడావిడి అసలు లేదు. పైగా మరోవైపు పలు బాషలనుండి బోలెడు హీరోయిన్లు టాలీవుడ్ లో హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రగ్యా జైస్వాల్ కి మంచి అవకాశాలు రావడం జరగని పని పాపం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -