Friday, March 29, 2024
- Advertisement -

పవన్ తో టూర్ కి వెళ్లి.. జనసేనలో చేరుతా : శ్రీరెడ్డి

- Advertisement -

పవన్ సినిమాలు చేసినా.. చేయకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం ఏ మారదు. అతని ఫ్యాన్స్ అతని కోసం ఏదైన చేయడానికి రెడీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే అభిమానులు.. ఆయన పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోవడం.. తమ పిల్లలకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడం థియేటర్లో ఫ్లెక్సీలు పెట్టించడం వంటివి చేస్తుంటారు.

అయితే వీటన్నిటికి భిన్నంగా ‘పవన్ మాల’ను ధరించారు కొంత మంది ఫ్యాన్స్.. విజయవాడ మొగరాజపురంలో పాలవసల కోటేశ్వరరావు అతని తమ్ముడు కోటి ఇద్దరు పవన్ అభిమానులు సర్వమత ప్రార్ధనలతో ‘పవన్ మాల’ను ధరించడం హాట్ టాపిక్ అవుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ కు విజయం దక్కాలని అప్పట్లో ఈ మాల ధరించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఘాటుగా స్పందిచారు వివాదాస్పద నటి శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ మాల ఏంట్రా.. అంటు బూతులు తిట్టింది శ్రీరెడ్డి. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఫోస్టు పెట్టింది. ఇక ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

ఎవరైన వ్యక్తితో టూర్ కి వెళ్లాల్సి వస్తే.. పవన్ కళ్యాణ్ తో వెళ్తానని.. ఎందుకంటే ఆయనతో రొమాన్స్ చేయడానికి కాదని.. ఆయన్ని ఆడగాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్పింది. పవన్ పోరాటంలో నిజాయితే లేదు.. ఆయన అనుభవం ఉన్న నాయకుడు అని నాకు అనిపిస్తే తప్పకుండా అతనికి సపోర్టు చేస్తా.. అంతేకాదు జనసేనలో కూడా చేరుతానేమో” అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -