దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్ తో శ్రీరెడ్డికి ఉన్న లింక్ గురించి అందరికి తెలిసిందే. అయితే మాజీ ప్రియుడు అభిరామ్ పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఇటీవలే అభిరామ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. అభిరామ్ గతంలో తనను అన్న మాటల్ని గుర్తుచేసింది.
”అభిరామ్ నీకు గుర్తుందా.. నీ కారు ఎంత? నీ స్థాయి ఎంత ? నేను రానా బ్రదర్ ని.. సురేష్ బాబు కొడుకుని.. రామానాయుడు మనవడ్ని.. నీదో డొక్కు కారు.. నువ్వు రోడ్ సైడ్ యాక్టర్స్ వి.. అని అన్నావే.. నన్ను, నా కారుని అవమానించావే.. ఈ రోజు నీ కారుకి ఏదో యాక్సిడెంట్ అయినట్లు ఉంది. దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు.. ఎప్పుడూ మిడిసిపడకు. డబ్బు, పేరు, అందం శాశ్వతం కాదురా.. మంచి పేరు, మంచితనమే శాశ్వతంగా ఉంటాయి. ఎవరికి అపకారం చేయకుండా ఉండటమే మంచిగా బ్రతకడం. నేను ఉత్తమురాలిని కాకపోవచ్చు. కానీ నేను నీకు చెప్పినవాటిని అనుసరిస్తా.. ఇంకా నేర్చుకుంటున్నా’ అంటూ ఎమోషన్ల్ అవుతూ తన ఫేస్ బుక్ లో వీడియో పెట్టింది శ్రీరెడ్డి.
ఇక అభిరాం కారు ప్రమాదం విషయంకు వస్తే.. మణికొండలో అభిరామ్ నడుపుతున్న బీఎండబ్ల్యూ కారుని ఎదురుగా వచ్చిన బ్రీజా కారు ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కరీంనగర్ జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మెకానిక్ లక్ష్మణ్ ద్వారా బ్రీజా కారు కొనేందుకు నగరానికి వచ్చాడు. యజమాని నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం కారు తీసుకుని స్నేహితుడు సతీష్తో కలిసి డ్రైవ్ కు వెళ్లాడు. మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్దకు వచ్చేసరికి.. పక్కగా వస్తున్న అభిరామ్ కారుని గమనించకపోవడంతో బలంగా ఢీ కొట్టాడు. అయితే కార్లలో ఉన్నవాళ్లకి గాయాలు కాలేదు కాని.. కార్లు మాత్రం దెబ్బతిన్నాయి.
నా మంచం మీద ఎల్లప్పుడు ముగ్గురు మగాళ్లు : కస్తూరి
సింగర్ సునీత పేరు చెప్పి రూ.1.7 కోట్లు కొన్నారు..!