Saturday, April 20, 2024
- Advertisement -

రానా, అల్లు అర్జున్ తో త్రిష వీడియో కాల్..!

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా 21 డేస్ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇంట్లోనే ఉండడం తో అందరూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. సెలబ్రిటీస్ కూడా తమ ఫ్యాన్స్ తో ఇస్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా టచ్లో ఉంటున్నారు.

నటి త్రిష ఈ మధ్య ఇస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ 21 డేస్ లో తను ఏం చేస్తోందో ఎప్పటికప్పుడు ఇస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది త్రిష. అయితే రీసెంట్ గా ఇస్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. మన తెలుగు హీరోలైన బన్నీ, రానాతో లైవ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షాట్ షేర్ చేసుకుంటూ విత్ థీస్ క్రాక్స్ కీపిన్ మీ కంపెనీ అని మెన్షన్ చేసింది త్రిష.

తన క్వారంటైన్‌ టైంని బన్నీ రానా మరియు తన ఇతర ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తోంది ఆమె. అయితే త్రిష షేర్ చేసిన ఆ ఫోటో తో రానా, త్రిషల లవ్ మ్యాటర్ మళ్ళీ వైరల్ అవుతుంది. వారు ఇంకా రిలేషన్షిప్ లోనే ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రానా లాస్ట్ ఇయర్ ఒక బాలీవుడ్ టాక్ షోలో త్రిషతో కొంతకాలమే రిలేషన్‍లో ఉన్న కానీ అది వర్క్అవుట్ అవ్వలేదు కానీ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అంటూ సమాధానమిచ్చాడు. మరి వీళ్ళ లవ్ మ్యాటర్ లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -