Thursday, March 28, 2024
- Advertisement -

విక్రమ్ వాసుదేవ్ గా మారిన అడివి శేష్

- Advertisement -

‘గూడచారి’ అనే సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను అందుకున్న యువ హీరో అడవి శేష్ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఎవరు’ అనే ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా కి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను సమంత చేతుల మీదగా దర్శక నిర్మాతలు విడుదల చేయించారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో సినిమా ఎలా ఉండబోతోంది అని తెలుస్తోంది. రెజీనా కసాండ్రా నవీన్ చంద్రా ని దారుణంగా హత్య చేసింది అని ఆమెపై ఆరోపణలు ఉంటాయి.

కానీ రెజీనా కసాండ్రా మాత్రం అతను తనని రేప్ చేయబోయాడు అని చెబుతుంది. ఈ కేసులోని నిజానిజాలను తెలుసుకోవడానికి వస్తాడు విక్రమ్ వాసుదేవ్ (అడవి శేష్). టీజర్ లాగానే ఈ సినిమా కూడా మొదటినుంచి ఆఖరి వరకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా ప్రేక్షకులకు ఒక త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనిపిస్తోంది. పీవీపీ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకి గూడచారి సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -