Wednesday, April 24, 2024
- Advertisement -

రాము కి విడుదల కష్టాలు తప్పట్లేదు.

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం లక్ష్మి ఎన్టీఆర్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మినహా ఈ సినిమా అనేక ఏరియా లలో విడుదల అయ్యి ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే ఎప్పటి నుండో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కూడా విడుదల చేయాలని భావిస్తుండగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వము కానీ ఎలక్షన్ కమిషన్ కానీ అందుకు రామ్ గోపాల్ వర్మ కు సహకరించడంలేదు.

ఇక పోతే ఎన్నికల అయిపోయిన తరుణం లో రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదలను ముందుకు తెచ్చే ప్రయత్నం చేసిన మరలా ఎలక్షన్ కమిషన్ అడ్డుపడి సినిమా ని విడుదల కానివ్వకుండా చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తరవుల మేరకు ఈ నెల 23 వ తారీఖు వరకు ఈ సినిమా విడుదల చేయకూడదు అని మరొకసారి స్పష్టం చేసినట్టు గా తెలుస్తుంది.

దీని బట్టి చూస్తే 23 వ తారీఖు దాటితే కానీ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా విడుదల చేసేందుకు ఆస్కారం కనిపించడం లేదు. ఒకవేళ ఎన్నికల్లో చంద్ర బాబు నాయుడు నెగ్గి తన ప్రభుత్వము అధికారం లోకి వస్తే అప్పుడు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదల కాకుండా చేస్తాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -