Tuesday, March 19, 2024
- Advertisement -

ఐశ్వర్య ని విలన్ గా మార్చిన దర్శకుడు

- Advertisement -

నవాబ్ సినిమా తో మరలా పుంజుకున్న దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వం అనే సినిమాని ని తెరకెక్కించడం లో బిజీగా గడుపుతున్నాడు. పీరియడ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ని తీసుకొద్దామ్ అనుకుంటున్న మణిరత్నం ప్రస్తుతం నటి నటులు ఎంపికతో బిజీ గా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లో వారు వీరు ఉండబోతున్నారు అని చాలా పేర్లు మనం మీడియా లో చూస్తూనే ఉన్నాం. అయితే ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ సినిమా లో ఐశ్వర్య రాయ్ ఒక ముఖ్య పాత్ర చేయనున్నది అని అందరూ చెప్పుకుంటున్నారు.

సాధారణం గా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకునే ఐశ్వర్య రాయ్, దక్షిణ చిత్ర పరిశ్రమ లో ఇంకా ఆచి తూచి అడుగులు వేస్తూ ఉంటుంది. మణిరత్నం చేయనున్న ఈ సినిమా లో ఒక నెగటివ్ రోల్ పోషించనున్నది అట ఐశ్వర్య రాయ్. ఒక మహారాణి గా ఐశ్వర్య ఈ చిత్రం లో కనిపిపించనున్నది అని టాక్. ఈ సినిమా మొత్తానికి ఐశ్వర్య రాయ్ పాత్ర ప్రధాన ఆకర్షణ గా ఉండబోతోంది అని మణిరత్నం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లో జయం రవి, శింబు, విక్రమ్, అమల పాల్ ఇంకా చాలా మంది నటించడం విశేషం. ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెల్లడి కానన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -