Thursday, April 25, 2024
- Advertisement -

విక్రమ్ సినిమా అనవసరం గా ఒప్పుకుందట…!

- Advertisement -

ఐశ్వర్య రాజేష్.. ఈ పేరు ఇప్పటికైతే తెలుగు ప్రేక్షకులకు పెద్ద గా తెలియదేమో కానీ తమిళం లో మాత్రం ఈ నటి తెలియని వారు లేరు. కాకాముట్టై అనే నేషనల్ అవార్డ విన్నింగ్ సినిమా లో తల్లి పాత్ర పోషించి అందరినీ ఆకర్షించిన ఐశ్వర్య రాజేష్ తన నటన తో ఎప్పటికప్పుడు విమర్శకుల నోర్లు మూయిస్తూ వస్తుంది.

ఈవిడ త్వరలో విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం లో ఒక హీరోయిన్ పాత్ర పోషిస్తుండడం ద్వారా ఈ మధ్య ఎక్కువగా మీడియా లో కనిపిస్తుంది. ఇప్పటికే ఐశ్వర్ రాజేష్ విజయ్ దేవరకొండ కి రిలేషన్ షిప్ ఉందని చాలా మంది రాస్తూ వస్తుండగా ఐశ్వర్య రాజేష్ ఇండైరెక్ట్ గా దీని పై రియాక్ట్ అయింది కూడా.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఐశ్వర్య రాజేష్ సామి 2 అనే సినిమా లో తను నటించకుండా ఉండాల్సింది అని చెప్పింది. సామి 2 లో ఐశ్వర్య రాజేష్ కొన్ని సీన్లు, పాటల వరకే కనిపిస్తుంది. సాధారణంగా ఐశ్వర్య రాజేష్ ఒప్పుకునే సినిమాలకి ఈ సినిమాలకి చాలా తేడా ఉండడం తో ఆవిడ అభిమానులు చాలా మంది నిరుత్సాహ పడ్డారు. ఇదే విషయం ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ కొంత ప్రెషర్ వలన అలానే మరి కొందరు వ్యక్తులు చెప్పడం వల్లన ఆ సినిమా లో నటించాల్సి వచ్చింది అని ఇక పై అలాంటి పాత్రలు చేయను అని తేల్చి చెప్పేసింది ఈ భామ.

ఎంతో టాలెంట్ ఉన్న నటి ఇప్పటికైనా అటువంటి పాత్రలు చేయను అని రియలైజ్ అవ్వటం హర్షించదగ్గ పరిణామం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -