Thursday, April 18, 2024
- Advertisement -

మహేష్ బాబు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథను అఖిల్ ఒప్పుకుంటాడా

- Advertisement -

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ వినిపించిన కథను ఐదవ సారి కూడా రిజెక్ట్ చేశాడు. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు తన తదుపరి సినిమా కోసం మహేష్ ని మాత్రం మెప్పించలేక పోతున్నాడు. నిజానికి ‘గీత గోవిందం’ సినిమా తర్వాత పరసురామ్ ముందు ప్రముఖ నిర్మాతలు అందరూ క్యూ కడతారని అందరు అనుకున్నారు. కానీ సినిమా క్రెడిట్ మొత్తం విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న లకే దక్కింది. మరోవైపు పరశురాం తన తదుపరి సినిమా కోసం హీరో ని ఒప్పించడం లో బిజీగా ఉన్నాడు.

తాజాగా పరసురాం మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథని జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడట. అయితే ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టిఆర్ కూడా ఆ కథకి నో చెప్పినట్లు తెలుస్తోంది. సొసైటీలో ఉన్న అవినీతి మీద ఇప్పటికే బోలెడు సినిమాలు బయటకు వచ్చాయని మళ్లీ అలాంటి సినిమానే ఎందుకు అని ఎన్టీఆర్ ఈ సినిమాకి నో చెప్పారట. అయితే తాజా సమాచారం ప్రకారం పరసురాం ఇప్పుడు అదే కథతో అక్కినేని వారసుడు అఖిల్ వద్దకు వెళ్లారట. ప్రస్తుతం స్పెయిన్ లో జరగనున్న నాగార్జున పుట్టినరోజు వేడుకల విషయంలో బిజీగా ఉన్న అఖిల్ పరశురామ్ కి ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంది. ఇండియాకి తిరిగి వచ్చాక పరశురాం తో మళ్ళీ ఒకసారి కలిసి ఈ సినిమా గురించి నిర్ణయం తీసుకొన్నాడు అఖిల్. పరశురాం తో ఓ సినిమా చేయడానికి అఖిల్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -