Thursday, March 28, 2024
- Advertisement -

అఖిల్ కెరీర్ లో కాస్ట్లీ హీరోయిన్

- Advertisement -

‘అఖిల్’ సినిమాతో హీరోగా మారిన అప్పటినుంచి అక్కినేని అఖిల్ ఇప్పటిదాక ఒక్క సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. ఈ మధ్యనే విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ సినిమా తో మరొక డిజాస్టర్ ని అందుకున్న ఈ యువ హీరో ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పేర్లు బయటకు వచ్చాయి కానీ తాజాగా చిత్ర దర్శక నిర్మాతలు ఆర్ హీరోయిన్ పూజా హెగ్డే ని ఎంపిక చేశారట. ఇంతకుముందు కూడా కియారా అద్వానీ, పూజ హెగ్డే, సాయిపల్లవి వంటి పేర్లు వినిపించాయ.

అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా కోసం లిమిటెడ్ బడ్జెట్ అనుకుంటున్నారట. కానీ పూజాహెగ్డే ఎంట్రీతో అని లెక్కలు మారిపోయాయి. గత కొంతకాలంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే అఖిల్ సినిమా లో హీరోయిన్ గా నటించడం కోసం ఏకంగా మూడున్నర కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా అఖిల్ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే నే. ప్రస్తుతం ఈమె ‘వాల్మీకి’, ‘అల వైకుంటపురం లో’ సినిమాలతో బిజీగా ఉంది. ప్రభాస్ రాధాకృష్ణ సినిమా లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -