Tuesday, April 23, 2024
- Advertisement -

సరికొత్త కాన్సెప్ట్ తో సమంత సినిమా

- Advertisement -

ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో హిట్ అందుకున్న సమంత ఇప్పుడు ‘ఓ బేబీ’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా సౌత్ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ మరియు పాటలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్ర దర్శక నిర్మాతలు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమా కథ ఎలా ఉండబోతోంది అని తెలుస్తోంది.

రావు రమేష్, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని, అలానే కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది అని సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. 74-ఏళ్ల సమంత 24 ఏళ్ల అమ్మాయిగా మారిపోయి తన యవ్వనాన్ని మళ్ళీ అనుభవించడం సినిమా కథ అని తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్ర ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. సురేష్ బాబు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా కి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 5 న విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -