అల్లు అర్జున్ సినిమా కోసం అతని అభిమానులు మంచి జోష్ మీదా ఉన్నారు. అల్లు అర్జున్ గత రెండు సినిమాలు ప్లాప్ కావడంతో అల.. వైకుంఠపురములో సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. తాజాగా అల.. వైకుంఠపురములో టీజర్ ను విడుదల చేశారు.
త్రివిక్రమ్ మార్క్ పవర్ ఫుల్ అండ్ కామెడీ పంచ్ లతో టీజర్ ను కట్ చేశారు. యూట్యూబ్ ఈ టీజర్ రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఇక టీజర్ విషయంకు వస్తే.. ’మీ నాన్నా పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడు నిన్ను’అంటూ మొదలైన టీజర్ ఒక నిమిషం 23 సెకన్ల పాటు సాగింది. ‘స్టైల్గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’, ‘సమ్థింగ్ కంప్లీట్ అవ్వట్లేదు.. ఇన్ని పాటలతో ప్యాకప్ చేశాక.. డైలాగ్ లేదనా’, ‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్లు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి మంచి హిట్ అయ్యాయి.
అందుకే ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రంలో టబు, సుశాంత్, నవదీప్, జయరామ్, సముద్రఖని, మురళీ శర్మ, నివేతా పేతురాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.