Saturday, April 20, 2024
- Advertisement -

సుకుమార్, అల్లు అర్జున్ సినిమా లాంచ్..!

- Advertisement -

రంగస్థలం తర్వాత సుకుమార్ మహేష్ బాబుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మహేష్, సుకుమార్ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నపలంగా ఆ సినిమాని ఆపేసి అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించాడు సుకుమార్. దాంతో సుకుమార్ కి మహేష్ బాబు అల్ ది బెస్ట్ చెప్పి.. అతనితో సినిమాని కాన్సెల్ చేసుకున్నాడు.

మరి ఎందుకు వీరి కాంబినేషన్ సెట్ కాలేదు అనేది పక్కన పెడితే.. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా.. ఈ రోజు పూజా కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, కొరటాల, సురేందరెడ్డి హాజరయ్యారు. దేవుడి చిత్ర పటాలపై అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా.. ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ రెండు సినిమాలకి మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్, తాజా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించనున్నాడు. ఈ ముగ్గిరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సరసన రష్మీక మందన నటిస్తోంది. ఇక ఈ సినిమా ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం బన్ని పూర్తిగా మేకోవర్ అవుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -