Thursday, April 25, 2024
- Advertisement -

రామ్ చరణ్ కి ఫ్రెండ్, అల్లు అర్జున్ కి విలన్

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వం లో మూడో సారి హీరో గా ఒక సినిమా లో ప్రస్తుతం నటిస్తున్నారు అల్లు అర్జున్. పూజ హెగ్డే ఈ సినిమా లో హీరోయిన్. ఇంతకు ముందు ఈ హీరో మరియు హీరోయిన్ కలిసి హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన దువ్వాడ జగన్నాథం అనే చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కి సంబంధించి ఒక విషయం ప్రస్తుతం మీడియా లో హల్చల్ చేస్తుంది.

ఈ సినిమా లో సీరియస్ విలన్ ఎవరూ ఉండరట కానీ నెగటివ్ ఛాయలు ఉన్న పాత్రని మాత్రం నవదీప్ పోషించనున్నారని తెలుస్తుంది. ఇంతకు ముందే నవదీప్ ఇలాంటి పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అది చూసే త్రివిక్రమ్ నవదీప్ కి ఈ సినిమా లో అవకాశం ఇచ్చారట. అంతే కాకుండా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా లో నవదీప్ చరణ్ కి ఫ్రెండ్ గా నటించగా ఇప్పుడు బన్నీ నటిస్తున్న ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నారు.

ఒకప్పుడు సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన 2 ఆర్య సినిమా లో బన్నీ, నవదీప్ బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -