Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ఇంట విషాదం.. ఏమైంది ?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట విషాదం నెలకొంది. అల్లు అర్జున్ మేనమామ ముత్తం శెట్టి రాజేంద్ర ప్రసాద్ హఠాన్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీకి ఆయననే సహ నిర్మాత.

ప్రసాద్ మరణంతో అల్లు ఫ్యామిలీలో విషాదం అలుముకుంది. ’అల వైకుంఠపురములో’ సక్సెస్ తో ఎంతో సంతోషంగా ఉన్న అల్లువారింట ఇది చోటుచేసుకోవడం బాధాకరం. బన్నీ అమ్మ గారు నిర్మలాదేవికి ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ సొంత అన్నయ్య. అల్లు అర్జున్ కు పెద్ద మావయ్య. ఆయనతో బన్నీకి మంచి అనుబంధం ఉంది. చిన్నప్పటి నుండి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు.

పండగలకు మావయ్య ఇంటికి అల్లు అర్జున్ వెళ్లేవాడు. తమ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉండే ప్రసాద్ చనిపోయారనే వార్త తెలియడంతో అల్లు ఫ్యామిలీ షాక్ గురైంది. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే అల్లు కుటుంబం మొత్తం విజయవాడకు వెళ్లింది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఈ మూవీ ద్వారా బన్నీ మేనమామ ప్రసాద్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ లో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. దురదృష్టవశాత్తు రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే ఆయన మరణించారు. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -