Friday, April 19, 2024
- Advertisement -

స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న బన్నీ

- Advertisement -

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠ పురంలో’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ ఒక పెద్ద కారు ముందు చిన్న వేసుకొని కూర్చుని ఉండగా, అతని డ్రైవర్ తనకి సిగరెట్ వెలిగిస్తూ ఉంటాడు.

బ్రాండెడ్ సూట్లో అల్లుఅర్జున్ చాలా స్టైలిష్గా కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో టబు, సుశాంత్ మరియు నివేదా పేతురాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘జులాయి’ మరియు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమాగా ‘అల వైకుంఠ పురంలో’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -