Friday, March 29, 2024
- Advertisement -

అమల పాల్ కి జరిగిన అవమానం

- Advertisement -

ఒక్కసారి గా కోలీవుడ్ లో ఆమె సినిమా టీజర్ తో సంచలనం సృష్టించిన అమల పాల్ ఇప్పుడు విజయ్ సేతుపతి తదుపరి చిత్రం నుండి తనని తీసేసిన విషయం లో ఒక ఓపెన్ లెటర్ రాశారు. ఈ సినిమా నిర్మాతలు చెప్పిన దానికి ప్రకారం, అమల పాల్ నిర్మాతలకు ఫ్రెండ్లీ గా వ్యవహరించకపోవడమే ఆమెని తీసేయడానికి కారణం అని తెలుస్తుంది. అయితే దీనికి పూర్తిగా ఉంది అమల పాల్ వాదన.

“నన్ను కావాలనే ఈ సినిమా లో నుంచి గెంటేశారు. ఇది నటి గా నా ఎమోషనల్ స్ట్రెంత్ కి సంబందించిన విషయం. నేను నిర్మాతలకు సహకరించడం లేదు అని వారు ఆరోపిస్తున్నారు కానీ ఇప్పటి వరకు నా పదేళ్లకు పైగా ఉన్న కెరీర్ అనుభవం తో ఒక్క సారి కూడా ఒక్క నిర్మాత ని కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను పని చేసిన నిర్మాతలు అందరూ బాగుండాలి అనే భావించాను. ఇప్పుడు కూడా నేను ఈ సినిమా కోసం కాస్ట్యూమ్స్ విషయం లో తిరుగుతున్నాను. దీనికి కూడా నా సొంత డబ్బులు పెట్టుకుంటున్నాను. కేవలం ఊటీ లో స్టే అడిగినందుకు నేను నిర్మాతలకి ఫ్రెండ్లీ గా లేను అని ఎలా చెప్తారు. ఇలాంటి నిర్మాతలు ఉంటె మంచి సినిమాలు వచ్చే అవకాశమే లేదు.”అని అమల పాల్ చెప్పారు.

దీని పై నిర్మాత ఇంకా ఏమి కామెంట్ చేయలేదు. ఇకపోతే అమల స్థానం లో ఈ సినిమా లో మేఘ ఆకాష్ ని తీసుకున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -