Friday, April 19, 2024
- Advertisement -

‘మహానటి’ కోసం కీర్తి సురేష్ కంటే ముందు ఈమెనే అడిగారట

- Advertisement -

ఒకప్పటి లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ సినిమా గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించింది. తన అద్భుతమైన నటనతో కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు మళ్ళీ జీవం పోసిన ట్లుగా నటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కీర్తి సురేష్ కంటే ముందు మరో హీరోయిన్ వద్దకు వెళ్లిందట ఆమె మరెవరో కాదు మలయాళం బ్యూటీ అమల పాల్. ఈ విషయాన్ని అమలాపాల్ స్వయంగా ‘ఆమె’ సినిమా ప్రమోషన్లలో బయటపెట్టింది.

“మహానటి సినిమా కోసం ముందుగా నన్ను అడిగారు. కానీ నేను ఆ సమయంలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతుండటంతో ఆ సినిమా చేయడం కుదరలేదు” అని చెప్పుకొచ్చింది అమల. సౌత్ ఇండస్ట్రీ లో అటు తమిళంలోనే కాక ఇటు తెలుగులో కూడా అమలాపాల్ కి మంచి ఇమేజ్ ఉంది కాబట్టి అమలాపాల్ కూడా సినిమా సావిత్రి పాత్రలో బాగానే నటించి ఉండేది అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ కీర్తి సురేష్ కంటే బాగా నటించి ఉంటుంది అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు అమలాపాల్ తమిళంలో నటించిన ‘ఆడయి’ సినిమా తెలుగులో ‘ఆమె’ అనే టైటిల్ తో జూలై 18న విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -