Thursday, April 25, 2024
- Advertisement -

తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కావాలంటున్న హీరోయిన్

- Advertisement -

ఇటీవలే తమిళం లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన చిత్రం ఆడై. ఈ సినిమా అటు ప్రేక్షకుల ప్రశంసలు, విమర్శకుల మెప్పు పొంది అమల పాల్ కెరీర్ లో ఒక మైలురాయి చిత్రం గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ భామ ఇప్పుడు ఈ సినిమా కి రెండో భాగం తో రావాలనే ఆలోచన చేస్తుందట. ఈ సినిమా ని తెలుగు లో ఆమె అనే పేరు తో విడుదల చేశారు కానీ ఎందుకో ఆశించిన స్థాయి లో సినిమా ఆడలేదు. అయితే తెలుగు లో రెండో భాగం కూడా అమల పాల్ నిర్మించాలని ఆలోచిస్తుంది.

బెజవాడ అనే సినిమా తో తెలుగు పరిశ్రమ లో కి ఎంటర్ అయిన అమల తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ల తో నటించినా ఆశించిన స్థాయి లో విజయం అందుకోలేదు. ఈ మధ్య నే సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన అమల పాల్ ఆడై విజయం తనకి ఎంతో సంతోషం ఇస్తుంది అని చెప్పింది.

ఇప్పుడు ఈ సినిమా కి రెండో భాగం తీయాలి అనుకుంటున్న అమల ఈ సారి తెలుగు లో ప్రేక్షకుల ని కూడా నిరుత్సాహ పరిచే విధం గా సినిమా ఉండకూడదు అనే ఆలోచన తో ఉందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -