Friday, April 26, 2024
- Advertisement -

పిల్లలకు ఆన్ లైన్ క్లాస్ లపై ఫైర్ అయిన అనసూయ..!

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆన్ లైన్ ఎడ్యుకేషన్ పై స్పందించింది. ఈ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను అనసూయ తప్పుబట్టింది. దీంతో ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది. కరోనా కారణం సడలింపులు ఉన్నప్పటికి ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు కరోనా బారిన పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్న కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఇప్పట్లో ప్రారంభించే సూచనలు కనిపించడం లేదు. దీంతో చాలామంది పేరెంట్స్ తమ పిల్లల కోసం ఆన్‌లైన్ క్లాసుల వేట ప్రారంభించి.. ఆ రకమైన విద్యకే మొగ్గుచూపుతున్నారు.

ఈ క్రమంలో దీనిపై అనసూయ రియాక్ట్ అవుతూ.. చిన్నపిల్లలు ఇలా గంటల తరబడి ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు చూస్తుంటే వారి కళ్లు పాడైపోతాయని పేర్కొంటూ ట్వీట్ చేసింది. . 10 సంవత్సరాల లోపు పిల్లల ఆన్‌లైన్ క్లాస్ లు కాకుండా వేరే పద్దతి ఏదైనా ఆలోచించండని ప్రభుత్వానికి సూచించింది. దాంతో తల్లిదండ్రులు కూడా అనసూయ చెప్పేది కరెక్టే అంటున్నారు. ఇక అనసుయ బుల్లితెరపై చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

పదేళ్ల పెళ్లి బంధంపై అనసూయ ఏం అన్నాదంటే ?

16 ఏళ్లకే ప్రేమలో పడ్డా.. తొమ్మిదేళ్లు పొరాడాను : అనసూయ

రాజకీయాల్లోకి అనసూయ.. మాములు ట్విస్ట్ కాదు ఇది..!

విజయ్ కి మహేష్ సపోర్ట్.. సెటైర్లు వేసిన అనసూయ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -