Thursday, April 25, 2024
- Advertisement -

తల్లితో సొంత ఊరు వెళ్లి సాయం చేసిన అనసూయ..!

- Advertisement -

యాంకర్ అనసూయకు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్‍లో ఈమెకు వీరాభిమానులు ఉన్నారు. అనసూయ లేకుంటే జబర్దస్త్ కూడా కొందరు చూడలేరు. ఇక అనసూయ జబర్దస్త్ షో తో పాటు ఇతర షోస్ కూడా చేస్తూ ఉంటుంది. అలానే సినిమాల్లో నటిస్తోంది. క్షణం, రంగస్థలంలో అనసూయ పోషించిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరికొన్ని సినిమాలతో ప్రస్తుతం అనసూయ బిజీగా ఉంది. అయిటే ప్రస్తుతం మూడు నెలల నుంచి లాక్ డౌన్ ఉంది. ఇప్పుడు ఇప్పుడే లాక్ డౌన్ ఓపెన్ చేయడంతో ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు. ఎప్పుడు లేనంత టైం రావడంతో ఈ లాక్ డౌన్ లో కుటుంబంతో గడిపేశారు చాలా మంది. సెలబ్రీటీలు కూడా ఈ లాక్ డౌన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. రిసెంట్ గా సీరియల్ షూటింగ్ కూడా మొదలయ్యాయి. అలాగే బుల్లితెర సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ షూటింగ్ కూడా మొదలై ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది.

ఒకవైపు షూటింగ్స్ తో మళ్లీ బిజీ అవుతున్న అనసూయ కాస్త టైమ్ తీసుకుని తన సొంత ఊరైన పోచంపల్లి కి వెళ్ళింది. తన మదర్ తో కలిసి సొంత ఊరికి వెళ్లి అక్కడ పొలాల్లో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసింది అనసూయ. అలాగే అక్కడ ఉన్న చేనేత కార్మికులకు సహాయం అందించింది. నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారికి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పింది అనసూయ. తను పోచంపల్లి వెళ్ళిన ఫోటోస్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఆమె షేర్ చేసిన ఫోటోస్ చూసిన వారంతా ఈ కష్ట సమయంలో మంచి పని చేశారు.. గ్రేట్ జాబ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అత్తగారింట్లోనే ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్..!

బాలకృష్ణ మాటలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు : పోసాని

రష్మీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శిల్పా చక్రవర్తి..!

ఫస్ట్ టైం శ్రీమతితో జబర్దస్త్ మహేష్ ఇలా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -