Saturday, April 20, 2024
- Advertisement -

ఫోటోషూట్‌ల‌తో రెచ్చిపోతున్న అన‌సూయ

- Advertisement -

తెలుగు మ‌హిళ యాంక‌ర్స్‌లో అన‌సూయ ఒక‌రు. న్యూస్ రీడ‌ర్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టి ఇక్క‌డి వ‌ర‌కు చేరుకుంది. ప‌లు టీవీ ఛానెల్లో ప్ర‌సార‌య్యే ప్రొగ్రామ్స్ యాంక‌రింగ్ చేస్తు మంచి క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి త‌రువాత కూడా బుల్లితెర మీద క‌నిపిస్తు త‌న హవాను చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి త‌రువాతే ఈ భామ‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌ప్ప‌టికి తెర మీద హాట్‌గా క‌నిపించ‌డంలో అన‌సూయ త‌రువాతే ఎవ‌రైనా. ఇక టీవీ షోల‌తో పాటు సినిమాల‌లో కూడా న‌టిస్తుంది ఈ బుల్లితెర స్టార్.

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మాత్త‌గా అనుసూయ న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. దీంతో అన‌సూయ‌కు ప‌లు సినిమాలలో అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. అభిమానుల‌తో కూడా ట‌చ్‌లో ఉంటుంది ఈ భామ‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న షోలు, సినిమాలు గురించి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇక ఈ మ‌ధ్య ఫోటోషూట్‌ల‌తో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న లేటెస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తుంది అనుసూయ‌. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -