వేదికల పైన యాంకరింగ్ చేసే యంకర్లు ఒకటికి పదిసార్లు రిహార్సల్ చేసుకోవడం తప్పనిసరి. వారు మాట్లాడే మాటల్లో ఏలాంటి తేడా ఉండకుడదు. ఏదైన తప్పుగా మాట్లడితే అది అందరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇటివలే ఓ బహిరంగ వేదికల యాంకర్ ఝాన్సీ అందరూ షాక్ అయ్యేలా మాట్లాడింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఏసుదాసును యాంకర్ ఝాన్సీ అమరుడిని చేసేసింది.
ఆయన సన్మాన సభలోనే ఈ వింత చోటు చేసుకుంది. ఏసుదాసు సన్మాన సభ తిరుపతిలో జరిగింది ఈ సభకు యాంకర్ ఝాన్సీ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఏసుదాసును పొగడాలనే ఉద్దేశంతో ఆమె అనవసర ప్రాసలకు ప్రయత్నించింది. దీంతో ఆయన్ను అమరుడు అంటూ చెప్పి అందరూ షాక్ అయ్యేలా చేసింది.
‘మనలో ఒకడు’ సినిమా ఆడియో సక్సెస్ మీటింగ్లో ఝాన్సీ మాట్లాడుతూ ‘అమర గాయకుడు ఏసుదాసు గారు’ అంటూ సంబోధించడంతో ఆయన సహా సభికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి కొందరు నవ్వుకున్నారు. అయితే ఇవేమీ ఝాన్సీ పట్టించుకోకుండా తన వ్యాఖ్యానం కొనసాగించింది. తర్వాతైనా ఝాన్సీ తన తప్పును సరిదిద్దుకుంటుందేమనని కార్యక్రమానికి హాజరైన పలువురు గాయకులు, సినీ, రాజకీయ ప్రముఖులు భావించినా ఆమె మాత్రం చేసిన పొరపాటును గుర్తించలేకపోయింది.
Related