Friday, April 26, 2024
- Advertisement -

యాంక‌ర్ ఝాన్సీ భ‌ర్త రెండో పెళ్లి ..ఎవ‌రిని చేసుకున్నాడో తెలుసా?

- Advertisement -

యాంక‌ర్ ఝాన్సీ మాజీ భ‌ర్త జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…. జోగి బ్రదర్స్ ప్రొగ్రామ్ ద్వారా బాగా పాపుల‌ర్ అయిన జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. విశాఖపట్నం అన్నవరంలో శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం ఆయన వివాహం జరిగింది. జోగి నాయుడు తన స్వగ్రామం అయిన చెర్లోపాలేనికి చెందిన సౌజన్య అనే యువతిని రెండవ వివాహం చేసుకున్నారు.

అంత‌క‌ముందు యాంక‌ర్ ఝాన్సీ , జోగి నాయుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది.త‌రువాత వీరి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు రావ‌డంతో విడాకులు తీసుకుని విడి విడిగా ఉంటున్నారు.వీరిద్ద‌రికి ఓ పాప కూడా ఉంది.ఆ పాప కోసం కోర్టుకు కూడా వెళ్లారు వీరిద్ద‌రు.దీంతో కోర్టు పాప తల్లి ద‌గ్గ‌ర ఉండ‌ల‌ని తీర్పు ఇచ్చింది.జోగి నాయుడు ప‌లు సినిమాల‌లో న‌టిస్తు బిజీగా ఉండ‌గా,ఝాన్సీ ప‌లు టీవీ షోల‌కి యాంక‌రింగ్‌తో పాటు సినిమాలు కూడా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -