కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అయిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికి కొన్ని ప్లేసుల్లో పేదలకు ఎలాంటి సహాయం అందడం లేదు. దాంతో ఈ విషయంపై జబర్దస్ యాంకర్ రష్మీ గౌతమ్ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది.
పేదలకు ఫుడ్ దొరకట్లేదని చెప్పింది. దయచేసి అందరూ విరాళాలు ఇవ్వాలని కోరింది. కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా సాయం చేసినట్లే అవుతుందని తెలిపింది. విరాళాలు అంటే పెద్ద మొత్తంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదని, చాలా మంది కలిసి ఒక్కో రూపాయి సాయం చేసినా చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. పేదవారు తిండికి దూరమవుతున్నారని తెలిపింది.
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ వారికి సాయం చేద్దాం అని రష్మీ కోరింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సాయం చేద్దామని పిలుపునిచ్చింది. సమాజంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదని విరాళాలు ప్రకటిస్తోన్న వారికి కృతజ్ఞతలు చెప్పింది. రష్మీ చేస్తున్న ఈ పని పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మీ చాలా ఎమోషనల్ అని.. ఆమె నిజంగా గ్రేట్ అని.. మా సపోర్ట్ ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.