Friday, April 19, 2024
- Advertisement -

ఆ రోజు రాత్రి వాళ్లు మ‌నుషుల్లా ప్ర‌వ‌ర్తించ‌లేదు – యాంక‌ర్ ర‌ష్మి

- Advertisement -

తెలుగు ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌ష్మి గురించి రెండు రోజుల క్రితం ఓ వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. వైజాగ్‌లో రష్మి కారు ఓ వ్య‌క్తిని ఢీ కొట్టినట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ర‌ష్మినే కారు డ్రైవింగ్ చేస్తుంద‌ని కూడా అన్నారు. తాజాగా దీనిపై స్పందించింది ర‌ష్మి. నేను వెబ్ సిరీస్‌లో భాగంగా న‌టించ‌డానికి వైజాగ్ వెళ్లాను. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంట‌నే వారిచ్చిన కారులో ఇంటికి బ‌య‌లుదేరాను.

డ్రైవ‌ర్ ప‌క్క‌నే నేను కూడా కూర్చున్నాను. యాక్సిడెంట్ జ‌రిగిన వెంట‌నే నేనే 108కి కాల్ చేశాను. 108 వాహ‌నం రావ‌డం ఆల‌స్యం కావ‌డంతో నేనే ప‌క్క‌న ఉన్న ప్ర‌భుత్వం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాను. అక్క‌డ అప్ప‌టికే చాలామంది గుమ్మిగుడి ఉన్నారు. నేను కారు డోరు తీసుకుని బ‌య‌టికి అలా వ‌చ్చానో లేదో అంద‌రు త‌మ సెల్‌ఫోన్ల‌తో ఫోటోలు, వీడియోలు తీయ‌డం మొద‌లుపెట్టారు. ప్రమాదంలో గాయ పడ్డ వ్యక్తిని కాపాడాలని కూడా చూడకుండా నన్ను విమర్శించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో వారు మనుషుల మాదిరిగా ప్రవర్తించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు.

ప్ర‌మ‌దానికి గురైన వ్యక్తిని లోనికి తీసుకుపోనివ్వ‌కుండా అడ్డంగా నిల‌బ‌డ్డారు. ఆ స‌మ‌యంలో కారు డ్రైవ‌ర్ కూడా నా ప‌క్క‌నే ఉన్నాడు. దీనికి సంబంధి దువ్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. డ్రైవర్ గౌతమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నా త‌ప్పు లేక‌పోయిన‌ప్ప‌టికి కావాల‌నే కొందరు నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. జ‌రిగింది త‌ప్పే కాని వాళ్లు ఆ రోజు రాత్రి మ‌నుషుల్లా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -