Thursday, April 25, 2024
- Advertisement -

ప‌టాస్ నుంచి త‌ప్పుకున్న శ్రీముఖి.. రీ ఎంట్రీ ఎప్పుడో..?

- Advertisement -

బుల్లితెరపై సందడి చేసే ఈ తరం యాంకర్స్ లో అనసూయ .. రష్మీ తరువాత అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న యాంకర్ గా శ్రీముఖి పేరు వినిపిస్తుంది.చిన్న చిత‌కా సినిమాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డికి పెద్ద‌గా క్రేజ్ రాలేదు. ప‌టాస్ అనే కార్య‌క్ర‌మంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది. రాముల‌మ్మ‌గా శ్రీముఖి ఫుల్ ఫేమస్. ప‌టాస్ షోలో శ్రీముఖి త‌న మాట‌ల‌తోనే కాదు గ్లామ‌ర్‌తోను అల‌రించింది.

ప‌టాస్ కార్య‌క్ర‌మం ఫుల్ హిట్ కావ‌డంతో ఈ మ‌ధ్య శ్రీముఖి, ర‌వి హోస్ట్‌గా ప‌టాస్ 2 కూడా మొద‌లు పెట్టారు. ఇద‌లా ఉంటె స‌డెన్ ప‌టాస్ ప్రోగ్రామ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు షాకింగ్ న్యూస్ తెలిపారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

నిర్వాహకుల అనుమతితోనే తాను బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు పేర్కొంది. త‌న‌ని ఇంత‌గా ఆద‌రించిన బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ విష‌యం తెలియాల‌నే ఈ వీడియో చేస్తున్న‌ట్టు తెలిపింది శ్రీముఖి. ప‌టాస్ షో త‌న హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైంద‌ని చెబుతూ, నిర్మాణ సంస్థ మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. మ‌రి శ్రీముఖి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవ‌డంతో ప‌టాస్ స్టేజ్‌పై ర‌వికి జోడీగా ఏ యాంకర్ అల‌రిస్తుందో చూడాలి .మరి మళ్ళీ రాములమ్మ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -