Friday, April 19, 2024
- Advertisement -

మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకోవడం లేదట

- Advertisement -

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి కొన్ని పుకార్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లను తీసుకున్నారని పుకార్లు బయటకు వచ్చాయి. వారి దగ్గర మహేష్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని ఆ వార్తల సారాంశం.

అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పుకార్లను కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవడం లేదని రామ్ లక్ష్మణ్ ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రాఫర్ లు గా పని చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. అంతేకాకుండా ఈ సినిమాలో కేవలం ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం మాత్రమే మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలోని మొదటి షెడ్యూల్ కశ్మీర్లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రెస్క్యూ ఆపరేషన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. రెండు వారాల పాటు జరగనున్న కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం హైదరాబాద్లో షూటింగ్ చేయనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -