మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచియమైంది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.తన మత్తు కళ్లతో అందరిని తన మాయలో పడేసింది. ఈ సినిమా తరువాత అను ఇమ్మాన్యుయేల్ వరస ఆఫర్లు వచ్చాయి.పవన్,అల్లు అర్జున్,గోపిచంద్,రాజ్ తరుణ్ సినిమాలలో హీరోయిన్గా నటించింది అను ఇమ్మాన్యుయేల్.సినిమాలు అయితే వచ్చాయి కాని హిట్లు మాత్రం రాలేదు.దీంతో రేసులో బాగా వెనక పడిపోయింది.
ఈ లోపు పూజా హెగ్డె వరసగా పెద్ద హీరోల సినిమాలలో హీరోయిన్గా ఎంపిక కావడంతో అను ఇమ్మాన్యుయేల్ పని అయిపోయింది.ఆమె వ్యక్తిగత కారణాలతో కొన్ని సినిమాలను వదిలేసింది.ఇప్పుడు ఆమె ఆశలు అన్ని శైలజారెడ్డి అల్లుడు సినిమాపైనే ఉన్నాయి.ఆమె చేతిలో ఈ ఒక్క సినిమానే ఉంది. ఈ సినిమా హిట్ ప్రభావం అను ఇమ్మాన్యుయేల్ కెరీర్పై ఉంటుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.శైలజారెడ్డి అల్లుడు సినిమా ఈ నెలలోనే థియోటర్లలో సందడి చేయనుంది.