Friday, April 19, 2024
- Advertisement -

సైరాలో అనుష్క అద్భుతం.. ఎంత తీసుకుందో తెలుసా ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. మొదటి షోకే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రం సాహో, బాహుబలి తర్వాత మూడో స్థానంలో నిలిచించి. దసర సెలవలు కావడంతో కలెక్షన్స్ విషయంలో బాహుబలి తర్వాత సైరానే నిలిచే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించాడు.

అయితే ఈ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ చిత్రంలో అందాల నటి అనుష్క గెస్ట్ రోల్ లో కనిపించి థియేటర్లో అభిమానులను షాక్ చేసింది. ఆమె ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆమె ఈ పాత్ర చేస్తుందని రిలీజ్ వరకు ఎక్కడ కూడా చెప్పలేదు సైరా టీం. దాంతో చూసే ప్రేక్షకుడుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. సినిమా మొదలు అవ్వగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ మొదలు అవుతుంది.

అక్కడ నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ తన వీర సైనికుల్లో స్పూర్తి నింపడానికి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి వీరత్వం గురించి గొప్పగా చెబుతూ కథ మొదలు పెడుతోంది. అయితే ఝాన్సీ లక్ష్మీ భాయ్ క్యారెక్టర్ లో అనుష్కను కాకుండా మరో హీరోయిన్ ను ఎవ్వరు కూడా ఊహించుకోలేనంత అద్భుతంగా నటించింది. చేసింది రెండు మూడు సీన్స్ మాత్రమే కానీ పాత్ర గుర్తుండిపోయేలా చేసింది. అయితే టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. అనుష్కకు ఈ చిత్రం కోసం 50 లక్షలపైనే సైరా నిర్మాతలు ఇచ్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైన అనుష్క పాత్ర మాత్రం సైరా సినిమాని మరో లేవల్ కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -