Friday, March 29, 2024
- Advertisement -

తమన్నా తో కలిసి డాన్స్ చేయనున్న అనుష్క

- Advertisement -

గత కొద్దీ రోజులుగా సినిమా పరిశ్రమ లో అనుష్క శెట్టి చిరంజీవి తో నటించబోతుంది అనే పుకార్లు మీడియా లో తిరిగాయి. సై రా నరసింహా రెడ్డి సినిమా లో చిరంజీవి తో పాటు ఒక ముఖ్య పాత్ర పోషించడమే కాకూండా సినిమా ని ప్రేక్షకులకి నరేట్ చేయడానికి అనుష్క ని అప్రోచ్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అనుష్క కానీ చిత్ర వర్గాలు కానీ దీని పై స్పందించలేదు. అది అలా పక్కన పెడితే ఈ సినిమా లో ఒక పాట లో కూడా అనుష్క మెరవనుంది అని టాక్ నడుస్తుంది. అయితే ఈ పాట జానపద బాణీ లో ఉండబోతుంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఉద్యమం లో పాల్గొనే సమయం లో ఈ పాట వస్తుందట.

అయితే ఇందులో అనుష్క తో పాటు తమన్నా కూడా స్టెప్పులు వేస్తుంది అని ఫిలిం నగర్ సమాచారం. సినిమా లో అత్యంత కీలక ఘట్టాలప్పుడు ఈ పాట వస్తుంది కనుక అక్కడ ప్రేక్షకులందరినీ సినిమా నుండి ధ్యాస మళ్లించకుండా ఉండేందుకు ఇలా ఇద్దరు స్టార్ హీరోయిన్ల తో పాట చేయాలి అని భావించారట ఫిలిం యూనిట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రామ్ చరణ్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -