ప్రతి సంవత్సరం టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ సినిమాల పండుగ గా మారిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరూ సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. తాజాగా 2020 సంక్రాంతి కూడా అ సమయంలో కూడా బోలెడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ‘అల వైకుంటపురంలో’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. మరో వైపు మహేష్ బాబు కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా అని అదే సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన ‘భాగమతి’ సినిమాని విడుదల చేసిన అనుష్క శెట్టి ఇప్పుడు తన తదుపరి సినిమా ‘నిశ్శబ్దం’ ని సంక్రాంతి బరిలో దింపనుందట. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రజినీకాంత్ దర్బార్ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని కాబోతోంది.