Saturday, April 20, 2024
- Advertisement -

నిశ్శబ్దం గా సాగుతున్న నిశ్శబ్దం ప్రమోషన్స్

- Advertisement -

‘భాగమతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుష్క శెట్టి సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉండి ఇన్నాళ్లకు మళ్ళీ ఒక థ్రిల్లర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ మాధవన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటుడు మైకేల్ మ్యాడ్సన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అనుష్క లుక్ ని ఈ సినిమా లో ఎలా ఉంటుందో ప్రేక్షకులకి రుచి చూపించారు.

ఇక ఈ సినిమాలో అనుష్క పాత్ర మిగతా సినిమాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుందని అర్ధమవుతోంది. ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ దానిని మేకర్స్ ఎందుకో సరిగా ప్రమోట్ చేయలేదు. ఈ విషయమై అనుష్క అభిమానులు కొంత అసంతృప్తి గా ఉన్నట్టు తెలుస్తుంది. నిశ్శబ్దం అనే టైటిల్ పెట్టి ఇలా నిశ్శబ్దం గా ఉంటె ఎలా అని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా వారు ప్రమోషన్స్ మొదలు పెడితే బాగుంటుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, గోపి సుందర్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 2020లో ఈ సినిమా తమిళ్ మరియు హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. చాలా కాలం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -