Thursday, March 28, 2024
- Advertisement -

సై రా సినిమాకోసం రంగంలోకి దిగనున్న అనుష్క

- Advertisement -

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి గతేడాది విడుదలై హిట్ అయిన ‘భాగమతి’ సినిమా తరువాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. తాజాగా బరువు తగ్గి స్లిమ్ గా మారిన అనుష్క ‘సైలెన్స్’ అనే థ్రిల్లర్ సినిమాలో నటించబోతోంది. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా ‘సై రా నరసింహ రెడ్డి’ సినిమాలో గెస్ట్ పాత్రలో అనుష్క కనిపించబోతోంది అని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.

అనుష్క ‘సై రా’ సినిమా లో ఒక స్పెషల్ అప్పియరన్స్ ఇవ్వబోతోందట. సినిమా మొదట్లో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర గురించి మనకు నెరేట్ చేస్తూ, యాంకర్ పాత్రలో అనుష్క కనిపించబోతోందట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్ కిచ్చా, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -