Thursday, April 25, 2024
- Advertisement -

‘రంగ‌స్థ‌లం’కు ఏపీ స్పెష‌ల్ ప‌ర్మిష‌న్‌

- Advertisement -

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో మార్చి 30వ తేదీపైనే అంద‌రికీ ఆసక్తి ఏర్ప‌డింది. ఎందుకంటే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తేజ‌, స‌మంత న‌టిస్తున్న సినిమా ‘రంగ‌స్థ‌లం’ విడుద‌ల కానుంది. వేస‌వి సినిమా పండుగ‌కు తొలి బోణి కొట్ట‌డానికి రామ్‌చ‌ర‌ణ్ వ‌స్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్పెష‌ల్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

స్పెషల్ షోలను అనుమ‌తి ఇస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో రూపొందించిన ‘రంగ‌స్థ‌లం’ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఒక షో ఎక్కువగా ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇవ్వాల‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో ఆ విన‌తిని ప‌రిశీలించి మంజూరుచేసింది. అంటే రోజుకు ఐదు ఆటలు ‘రంగ‌స్థ‌లం’ ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. వేస‌వి కావడంతో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో అద‌న‌పు షోకు ప్రభుత్వం వెంటనే పచ్చ‌జెండా ఊపింది.

ఈ సినిమా రికార్డులు తిరగరాసేలా క‌నిపిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్‌కు మ‌రో మ‌గ‌ధీర మాదిరి క‌లెక్ష‌న్లు వ‌చ్చేలా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నాలు వేస్తున్నారు. దానికి ఈ అద‌న‌పు షో క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. తెలంగాణలో ఇంకా దీనిపై ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -