Friday, April 19, 2024
- Advertisement -

లస్ట్ స్టోరీస్ లాంటి సినిమా తీస్తా అంటున్న సందీప్ వంగ

- Advertisement -

‘అర్జున్ రెడ్డి’ సినిమా తో తెలుగులో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి మరొక బ్లాక్ బ్లాక్ బస్టర్ ను నమోదు చేసుకున్నారు. ఇప్పుడు సందీప్ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన తదుపరి సినిమా ఎలా ఉండబోతోందో సందీప్ వంగా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈసారి సినిమా కాకుండా నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ ఫిల్మ్ తీయడానికి సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హిందీలో అలానే వెబ్ ఫిలిం గా విడుదలైన లస్ట్ స్టోరీస్ ఇప్పుడు తెలుగు లో సందీప్ వంగ తీయనున్నట్లు తెలుస్తోంది. హిందీలో లస్ట్ స్టోరీస్ లోని నాలుగు కథలు నాలుగు దర్శకులు తెరకెక్కించారు. అందులో ఆఖరి కథ లో నటించింది కియారా అద్వానీనే. మరి తెలుగులో కూడా ఇలానే నాలుగు కథలు ఉంటాయా లేక ఒకటేనా? తెలుగులో ఎవరు నటిస్తే నటించనున్నారు? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్ వంగ త్వరలో ఈ వెబ్ ఫిల్మ్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -